హైదరాబాద్: టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి ఏం మాట్లాడిన వివాదమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఓయూ విద్యార్థి జేఏసీ నేతగా అనేక సంచలన ప్రకటనలు చేశారు. అప్పట్లో సంక్రాంతి శెలవుకు వెళ్లిన ఆంధ్రా పెట్టుబడిదారులు ఇక తెలంగాణకు రావద్దని తేల్చిచెప్పారు. అప్పుడు రవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అప్పటి నుంచి పిడమర్తి ఏం మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ అవుతోంది. అయితే ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో ఓడినా తానే ఎమ్మెల్యేనంటూ హుకుం జారీ చేశారు. ఇక నుంచి ఏ పనులు కావని, అందరికీ నట్లు బిగిస్తానని హెచ్చరించారు. సత్తుపల్లిలో ఏ పని జరగాలన్న తన ద్వారానే అవుతాయని పిడమర్తి రవి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రవి టీఆర్ఎస్లో చేరారు. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా భాధ్యతలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm