న్యూఢిల్లీ: క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఈసారి బస్, విమాన టికెట్లపై భారీ రాయితీలు ఆఫర్ చేస్తోంది. దేశీయ విమానాలపై వెయ్యి రూపాయలు, అంతర్జాతీయ టికెట్లపై 12 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. హోటల్ బుకింగ్స్పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొంది. అలాగే, బస్ టికెట్లపై 20 శాతం తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఇందుకోసం ఎటువంటి కూపన్ కోడ్ వాడాల్సిన పనిలేదని తెలిపింది.
ఫ్లిప్కార్ట్ తాజా ఆండ్రాయిడ్ యాప్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు కూడా ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే, ఇండిగో న్యూ ఇయర్ సేల్కు మాత్రం నేటితో ఆఖరు. ఈ ఆఫర్ కింద ఇండిగో అంతర్జాతీయ సర్వీసుల టికెట్ల కనీస ప్రారంభ ధర రూ.3,239. ఈ ఆఫర్లో భాగంగా బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 09:38PM