ఆగ్రా: యూపీలోని ఆగ్రా నగరంలో దారుణం జరిగింది. కోచింగ్ కు వెళ్లి తిరిగి స్కూటీపై ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ఆమెను బలవంతంగా యమునా నది ఒడ్డున కొండల్లోకి లాక్కెళ్లారు. కొండల్లో మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. నలుగురు యువకులు బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిపి పరారయ్యారు. తమ కూతురు కనిపించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం రాత్రి పిర్యాదు చేశారు. బాధిత యువతి తలపై గాయమైంది. బాధిత బాలికను ఎస్ఎన్ వైద్యకళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, తాము కేసు నమోదు చేసి గాలిస్తున్నామని ఆగ్రా ఎస్పీ ప్రశాంత్ వర్మ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm