ఢిల్లీ: విభజన హామీల అమలు విషయంలో కేంద్రం మౌనంపై టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటల ప్రభుత్వంగా కనిపిస్తోందే తప్ప.. చేతల ప్రభుత్వంగా కనిపించడం లేదని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఎంపీ జితేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఏమీ లేదని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఎంపీలు వినోద్, కవిత తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు విభజన హామీల అమలు కోసం మంగళవారం ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి వినతపత్రాలు సమర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm