ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లిలో పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపగా ఎంపీ శివప్రసాద్ మాత్రం ఈసారి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వీరపాండ్య కట్టబొమ్మన్ వేషధారణ చేసి చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm