కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ శివారులోని పెద్దచెరువు కట్టపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన బైరి రాజనర్సు(50)ను బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై మోది హత్యచేసి మృతదేహాన్ని చెరువు కట్ట వద్ద తూము గద్దెపై పడేశారు. దీనిపై సమాచారం అందుకున్నకమలాపూర్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్ సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిరువ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న రాజనర్సు హత్యఘటన కమలాపూర్లో చర్చనీయాంశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm