న్యూఢిల్లీ: లోక్సభ సమావేశం రెండవసారి వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమవుతుంది. తొలిసారి వాయిదా పడి సభ ప్రారంభమైన తరువాత సభ్యుల ఆందోళన మధ్యే వివిధ కమిటీలు తమ నివేదికలను సభకు సమర్పించాయి. రాఫెల్ డీల్పై జెపిసి ఏర్పాటు చేయాలని సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. గందరగోళం మధ్యే సభ్యులు అత్యవసర అంశాలను ప్రస్తావించారు. రాఫెల్ డీల్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. శబరిమల అంశాన్ని బిజెపి సభ్యుడు రాధాకృష్ణన్ ప్రస్తావించారు. సభ్యుల ఆందోళనతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడటంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm