అహ్మదాబాద్: గుజరాత్లోని గీర్ అటవీ ప్రాంతంలో ఒక గూడ్సు రైలు కిందపడి మూడు సింహాలు మృతి చెందాయి. అమ్రేలీ జిల్లాలో గీర్ అటవీ మార్గంలో రైలు పట్టాల వెంట ఆరు సింహాలు నడిచి వెళుతున్నాయి. అదే సమయంలో ఆ పట్టాలపై వచ్చిన రైలు మూడు సింహాలపైనుంచి వెళ్లిపోయింది. రెండు మగ సింహాలు, ఒక ఆడసింహం అక్కడికక్కడే మరణించాయని జునాగఢ్లోని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డి.టి వసవాడ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm