శ్రీనగర్ : గత వారంలో పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బలగాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో.. చేసేదిమీ లేక కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఈ సంఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. ఆర్మీ బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బుల్లెట్ల స్థానంలో టియర్ గ్యాస్ కానీ, వాటర్ కేనన్స్ ఉపయోగించాలని సూచించారు. మృతి చెందిన తర్వాత మళ్లీ తిరిగి ప్రాణాలు తీసుకురాలేం కదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కావని అనుకుంటున్నానని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm