న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే.. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఉంటుందని ఆయన అన్నారు. అలాగే విభజన చట్టం 12వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలన్నీ ఏపీకి అమలు చేశామని.. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు గంగారాం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm