న్యూఢిల్లీః లోక్సభ సమావేశం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. సభ్యులు నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో సభలో తీవ్ర గందరగోళం చేస్తున్నారు. సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారనే విషయం అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కేంద్రమంత్రి జెపి నడ్డా సరోగసి రెగ్యులేషన్ బిల్ - 2018ని సభలో ప్రవేశపెట్టారు. నినాదాల మధ్యే ఆయన బిల్లు గురించి వివరిస్తూ మాట్లాడారు. వాణిజ్య సరోగసిని పూర్తిగా నిరోధించాల్సిన అవరసముందని ఆయన అన్నారు. భారతదేశం వాణిజ్య సరోగసి క్లినిక్స్ హబ్గా మారిందని ఆయన అన్నారు. సరోగసికి అంగీకరించిన మహిళలను ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూడాల్సి ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm