హైదరాబాద్ : బిసిల రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. టిఆర్ఎస్లోని బిసి ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. సకల జనుల సర్వేలో బిసి లెక్కలు బైటపెట్టలేదని ఆయన చెప్పారు. బిసిల ఓట్ల కోసం స్కీమ్లు పెట్టారని, ఎన్నికల్లో గెలిచాకా బిసిల రిజర్వేషన్లు తగ్గించారని ఆయన చెప్పారు. బిసిల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. బిసిలు అధికారంలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. బిజెపి నాయకులను కూడా బిసి ఉద్యమంలోకి తీసుకువస్తానని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm