హైదరాబాద్ : గీత గోవిందం హిట్ తో తెలుగులో రష్మిక మందన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రమైన డియర్ కామ్రేడ్ఃలోను ఆమెనే హీరోయిన్. మరికొన్ని ప్రాజెక్టులలో ఆమెని కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కన్నడలోను రెండు సినిమాలు చేస్తోంది .. అందులో ఒకటి పొగరు.
ధృవ్ సార్జా కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుంది. గంగాధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి నంద కిషోర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. అందువలన ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఇక తెలుగులో ఆమె క్రేజ్ ను మరింత పెంచడానికి డియర్ కామ్రేడ్ ఉండనే వుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 03:44PM