ముంబయి : హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ చేయడం బాలీవుడ్లో కామన్. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన బాఘి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్గా బాఘీ2 చిత్రాన్ని తీసారు. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ప్రధాన పాత్రలలో పోషించగా నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ బాఘీ2 రిజల్ట్తో సంబంధం లేకుండానే బాఘీ 3 కూడా ప్లాన్ చేశారు .ఇందులోను టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించనుండగా, కథానాయికగా సారా అలీ ఖాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారట. బాఘీ 2 చిత్రం తెలుగులో వచ్చిన క్షణం ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm