హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. కానీ కాంగ్రెస్ నేతలకు తాము ఓడిపోయామని ఇంకా నమ్మబుద్ది కావడం లేదు. అందుకే ఇంకా ఆ ఎన్నికల మీద అనుమానాలు వస్తూనే ఉన్నాయి. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏదో గడబిడ జరిగిందన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. పోలింగ్ జరిగిన ఓట్లకు, కౌంటింగ్ అయిన ఓట్లకు మద్య తేడా ఎందుకు వస్తోందని ప్రశ్నించిన ఆయన వేల సంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రికిరాత్రే 11 శాతం ఓటింగ్ ఎలా పెరిగిందని అయన ప్రశ్నించారు. మరి ఈసీ ఇంకా సమాధానం చెప్తుందా!
Mon Jan 19, 2015 06:51 pm