హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సిపి అంజనీకుమార్ సూచించారు. కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు గైడ్లైన్స్ రూపొందించారు. ఈ విషయమై సిపి మాట్లాడతూ..డిసెంబరు 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో హోటల్ యాజమాన్యాలు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిజేలకు అనుమతి లేదు. ఈవెంట్ ఆర్గనైజర్లు బౌన్సర్లను నియమించుకోవాలి. 45 డెసిబుల్స్ కంటే సౌండ్ బాక్స్ మించారాదని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగంపై నిషేధం అమలులో ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm