ముజఫరాపూర్: ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్పై ముజఫరాపూర్ కోర్టులో కేసు దాఖలైంది. తమన్నా హస్మి అనే ఫిర్యాదుదారు ఐపీసీలోని 153, 295, 504/34 కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి మధ్యప్రదేశ్కు వస్తున్న వలసదారులు స్థానికుల ఉద్యోగాలకు గండికొడుతున్నారని కమల్నాథ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాల విషయంలో మధ్యప్రదేశ్ స్థానికులను ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించిన తర్వాతే పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా తమ పథకాలు ఉంటాయని, ఇందుకు సంబంధించిన ఫైలుపై తాను సంతకం చేశానని ఆయన చెప్పారు. బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులతో స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇప్పటికే మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 06:50PM