హైదరాబాద్ : బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. పసిడి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా.. ఇవాళ మళ్లీ డౌన్ అయ్యింది. పెళ్లిళ్ల సీజన్ లేకపోవడంతో అమాంతంగా పుత్తడి డిమాండ్ పడిపోయింది. దీంతో బంగారం ధర రూ.32 వేల దిగువకు చేరింది. నగల వర్తకుల నుంచి డిమాండ్ లేకపోవడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టినట్లుగా ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
అంతేకాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు కూడా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని వెల్లడించాయి. అందువల్లే నేటి ట్రేడింగ్లో పసిడి ధర రూ.210 తగ్గి.. 10గ్రాముల బంగారం రూ. 31,850కు చేరింది. ఇక ఇదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. రూ.435 తగ్గడంతో కిలో వెండి రూ.37,880కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 06:54PM