విశాఖ: దేశంలో సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో రావచ్చునని ఎన్నికలకు సిపిఐ సిద్ధంగా ఉండాలన్నారు ఆ పార్టీ సిపిఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి. తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో మాట్లాడిన అయన దేశంలో మోడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. దేశంలోని మైనార్టీలపై మోడీ ప్రభుత్వం కక్ష్య కట్టిందన్న సురవరం నల్లధనం నియంత్రించలేదు కానీ కొత్తనోట్ల ముద్రణకు ఎనిమిది వందల కోట్లు ఖర్చుచేశారన్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఉండగా అంబానీ కంపెనీకి యుద్ధవిమానాల తయారీ ఇవ్వడం, ఒప్పందానికి మూడు రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ పెట్టడం, సుప్రీం కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రతీక అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm