హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ మేక రమేష్ తో కలిసి లబ్ధిదారులకు చీరలు పంపిణి చేశారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చాంద్రాయణగుట్టలో స్థానిక నాయకులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వనపర్తి పట్టణంలోని ఇందిరా కాలనీలో ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జేసీ వేణుగోపాల్, మునిసిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm