శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లో పెథాయ్ తుపాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తుపాన్ విధ్వంసానికి ఏపీలోని పలు ప్రాంతాలు నాశనం అయిపోయాయి. చేతికందేలోపే పంటను తుపాన్ తుడిచిపెట్టేసింది. దీంతో అన్నదాతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల గుండె బరువెక్కింది.
శ్రీకాకుళానికి చెందిన ఓ రైతు మాత్రం తుపాన్ ధాటికి నాశనమైపోయిన తన పంటను చూసి అక్కడే కుప్పకూలిపోయాడు. ఇన్నిరోజులు పడ్డ కష్టం నీటిపాలైపోయిందని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు ఆ రైతు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీలో పెథాయ్ సృష్టించిన విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పెథాయ్ తుపాన్ వల్ల ఏపీలో మొత్తం 14000 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. కోస్తాంధ్రా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా పెథాయ్ సైక్లోన్ ఒడిశాకు మళ్లింది. దీంతో ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అక్టోబర్లోనే తిత్లీ తుపాన్ శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేసింది. ఆ ఘటనను ఇంకా మరవకముందే పెథాయ్ తుపాన్ విరుచుకుపడింది. దీంతో అన్నదాతలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 07:54PM