న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మహాకూటమికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపైనా నేతల స్పందన ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అంటూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించగా, ఎన్సీపీ, సీపీఎం తదితర పార్టీల నేతలు ఇప్పుడే నిర్ణయించడం తొందరపాటే అవుతుందంటూ స్పందించారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.
ఇది సమయం కాదు. ఎన్నికలు రానివ్వండి. మేమంతా కలిసి చాలా బలంగా ఉన్నాం. కలిసి పనిచేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా ఏ నిర్ణయం తీసుకుంటాయో అదే మీరు అడిగిన దానికి సమాధానం అవుతుందిః అంటూ పీఎం అభ్యర్థిత్వంపై మమత బెనర్జీ బుధవారంనాడు మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 08:14PM