ఖమ్మం: తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చలితో వణుకుతున్నారు. ఒకవైపు చిరుజల్లులు మరోవైపు ఈదురుగాలులు తోడు కావడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఇళ్లనుండి బయటకు రావాలంటేనే జిల్లా వాసులు హడలిపోతున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన వుడుముల వెంకటరెడ్డి(93), అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీకి చెందిన వేల్పుల చిన్నవీరస్వామి (55), బూర్గంపహాడ్ మండలం గౌతంపురం కాలనీకి చెందిన పుట్టి పిచ్చయ్య(70), ఇదే మండలంలోని రెడ్డిపాలెంకు చెందిన కొండపర్తి వెంకటప్పయ్య(70) బుధవారం చలితీవ్రతకు తట్టుకోలేక మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన పరికపల్లి మదారమ్మ (80) చలితీవ్రతకు తాళలేక చనిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 08:29PM