ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని మోనా బీచ్లో సోమవారం గల్లంతైన నల్లగొండ పట్టణానికి చెందిన జునైద్ ఆచూకీ నేటికీ లభించలేదు. అతడి కోసం అక్కడి అధికారులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉన్న తమ బంధువులతో, అక్కడి వారితో వారు సంప్రదింపులు జరుపుతున్నారు. జునైద్ మృతదేహం లభించినట్లయితే నల్లగొండకు తీసుకొచ్చే ప్రయత్నంలో వారు ఉన్నారు. మోనా బీచ్కు వెళ్లి సముద్రంలో మునిగి మృతి చెందిన జిల్లాకు చెందిన మరో వ్యక్తి గౌసుద్దీన్ మృతదేహాన్ని ఆస్ట్రేలియాలోనే ఖననం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు గాను గౌసుద్దీన్ అన్నతో పాటు ఇతర బంధువులు ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఎమర్జన్సీ వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm