జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. గత జూన్ నెలలో మెహబూబా ముఫ్తి ప్రభుత్వం కూలిన తర్వాత ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే కాగా ఆ తర్వాత పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించినా గవర్నర్ అందుబాటులోకి రాకపోవడం, ప్రభుత్వాన్ని రద్దు, ఫ్యాక్స్ మిషన్ పనిచేయలేదని సాకులు, ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ పాలనను కొనసాగించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 92 ప్రకారం కచ్చితంగా గవర్నర్ పాలన ఆరునెలల పాటు విధించాలి. ఈనెల 19నాటికి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించి ఆరు నెలలు పూర్తయినందున రాష్ట్రపతి పాలన విధించాలని కోరతూ గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కు ఫ్యాక్స్ వెళ్లడంతో ఇవాళ రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నుంచి వచ్చిన వర్తమానాన్ని కేంద్ర హోం శాఖకు పంపగా కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అర్ధరాత్రి నుండి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లనుంది.
Mon Jan 19, 2015 06:51 pm