హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. బుధవారం బతుకమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్లో 6.92 లక్షలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 6.49లక్షలు, మేడ్చల్ జిల్లా పరి్యధిలో 4.87 లక్షలు మందిని అర్హులుగా గుర్తించారు.
కాగా బంజారాహిల్స్లోని వెంకటేశ్వరనగర్లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ రసాభాస ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే జరిగింది. ఇరువర్గాలకు ఎమ్మెల్యే దానం నచ్చజేప్పే ప్రయత్నం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 09:38PM