న్యూఢిల్లీ : 2016లో లోక్సభలో ప్రవేశపెట్టిన అద్దె గర్భం (సరోగసీ బిల్లు) బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. ఇతర సమస్యలపై కాంగ్రెస్, అన్నాడిఎంఎలు ఇతర అంశాలపై నిరసన తెలుపుతుండగానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు వాణిజ్యపరమైన అద్దెగర్భాన్ని నిషేధించనుంది. కేవలం సమీప బంధువులకు మాత్రమే వర్తించేలా నిబంధనలు పొందుపరిచారు. సరోగసీ ప్రక్రియ నిరోధానికి సంబంధింత అధికారులతో జాతీయ, రాష్ట్ర సరోగరీ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. సరోగసీ ద్వారా బిడ్డ జన్మించడానికి తల్లి లేదా ప్రతిపాదిత జంట ఈ అధికారుల నుండి ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ ప్రక్రియ వర్తించదు. హోమో సెక్సువల్, సింగిల్ పేరెంట్, సహజీవనంలో ఉండే వారికి కూడా వర్తించదు.ఈ ప్రతిపాదిత చట్టం పిల్లలు లేని వారికి వర్తిస్తుంది. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం వ్యాపార అద్దె గర్భాన్ని నిరోధించి, ఆధునిక పద్ధతి ఉపయోగించడం ద్వారా పిల్లలను కనడం, కుటుంబాలను రక్షించడమే ధ్యేయమని ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm