లక్నో : ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 178 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన ఓ ఇంటికి రూ. 23 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని అబ్దుల్ బసిత్ మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు తన ఇంటికి వేసిన కరెంట్ బిల్లు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం బిల్లులా ఉందన్నారు. 178 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ. 23,67,71,524లు వేశారని తెలిపారు. తన జీవిత కాలం మొత్తం సంపాదించిన ఈ బిల్లును చెల్లించలేను అని చెప్పారు. ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ కరెంట్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుందని తెలిపారు. ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm