విశాఖ: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27న ఛలో ఢిల్లీ రైలు యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రలు జనఘోష పేరుతో రౌలు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చ వేదిక చివరి పోరాటమని, పార్లమెంట్ చివరి సమావేశాల్లోనైనా ఏపీకి న్యాయం జరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైలు యాత్రకు అన్ని సంఘాల మద్దతు కోరుతున్నామని కొణతాల రామకృష్ణ అన్నారు. రైలు యాత్ర తర్వాత రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని కొణతాల రామకృష్ణ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 12:41PM