నేపియర్ : కివీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 132 పరుగుల వద్ద అవుటయ్యాడు. కోహ్లీ 59 బంతుల్లో 45 పరుగులు చేసి ఫర్గూసన్ బౌలింగ్ లో లాథమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భారత్ విజయానికి ఇంకా 20 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ స్కోరు 132/2. ఓపెనర్ ధావన్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm