నేపియర్: కివీస్ పర్యటనను టీం ఇండియా ఘనంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో సీరిస్ను కైవసం చేసుకున్న భారత్ అదే ఫాంను న్యూజిల్యాండ్లో కూడా కొనసాగించింది. నేపియర్లో కివీస్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. విజయంలో ఓపెనర్ ధావన్ 75పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ కోహ్లీ 45 పరుగులు చేసాడు. విజయంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు.
Mon Jan 19, 2015 06:51 pm