హైదరాబాద్ : నెల్లూరు జిల్లా తడలో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి చెన్నైకు కారు తరలిస్తున్న రూ.6.30 కోట్ల భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు సోదాలు చేస్తుండగా భారీ నగదు పట్టుబడింది. చెన్నైలో జువెల్లరీ కొనుగోళ్లకు నగదు తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm