హైదరాబాద్ : విశాఖ జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జై ఆంధ్రా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువతి చనిపోగా.. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాలనీలో నివాసం ఉంటున్న కొవ్వాడ దేవి(22), అరవింద్ అలియాస్ భానుప్రశాంత్(24) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. దేవీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. అరవింద్ ఐటీఐ చేసి కూలీ పనులు చేసుకుటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే దేవీకి తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిపారు. దీంతో ఆందోళన చెందిన దేవి, అరవింద్.. వేరువేరు చోట్ల ఉరేసుకున్నారు. అయితే దేవి చనిపోగా.. అరవింద్ను చివరి క్షణాల్లో రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm