మేల్ఘాట్: మహారాష్ట్రలో గిరిజనలు ఉగ్రరూపం దాల్చారు. అటవీశాఖ అధికారులు, పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటన అమరావతిలోని మేల్ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం వాహనాలను, ఆస్తులను గిరిజనులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అటవీశాఖ సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. వారంతా ఇప్పుడు హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మేల్ఘాట్కు చెందిన కొందరు గిరిజనులకు అకోలాలో పునరావాసం కల్పించారు. అయితే పునరావాసం కల్పించిన వారికి పూర్తి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆ గిరిజనులు అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను నివారించే క్రమంలో ఘర్షణ చోటుచేసుకున్నది.
Mon Jan 19, 2015 06:51 pm