హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీని నియమించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రియాంకకు యూపీ బాధ్యతలు అప్పగించడం తెగ ఉత్సాహపడిపోయే విషయమేమీ కాదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
కానీ కొందరు భజనపరులకు మాత్రం ఇది చాలా పెద్ద, భూమి కంపించిపోయే విషయంగా మారిందని ఎద్దేవా చేశారు. గతంలోనూ ప్రియాంకా గాంధీని ఎన్నికల ప్రచారానికి దించారని జీవీఎల్ గుర్తుచేశారు. ఆమె ప్రచారానికి దిగిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 04:13PM