హైదరాబాద్: రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బుధవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నటి ఛార్మి క్లాప్ కొట్టారు. నిర్మాత స్రవంతి రవి కిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరో ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం కోసం రామ్ మరింత ఫిట్గా తయారయ్యారు. ఇందులో ఆయన విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నారట. ఈ ఏడాది కుదిరిన క్రేజీ కాంబినేషన్ ఇది. ఎనర్జిటిక్ స్టార్, డ్యాషింగ్ డైరెక్టర్ కలిసి ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతున్నారో చూడాలి. 'మెహబూబా' సినిమా తర్వాత పూరీ తీస్తున్న చిత్రమిది. రామ్ గత ఏడాది 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో హిట్ అందుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm