ముంబై: పంజాబ్ నేషనల్ బాంకు రుణ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్ చొక్సీకి ఎసీబీఐ రుణ రికవరీకి సంబంధించి నోటీసులు పంపింది. చోక్సి , ఆయన కుటుంబం, కంపెనీలు రూ. 405 కోట్ల రుణ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్బీఐ నోటీసులో పేర్కొంది. దేశం నుంచి పారిపోయి ఆంటిగువాలో ఉంటున్న చోక్సి ఇటీవల తన భారత పౌరసత్వం వదులుకున్నారు. చోక్సి మేనల్లుడు నీరవ్ మోడీ, కుటుంబ సభ్యులు, పంజాబ్ నేషనల్ బాంకుకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వాములు.
Mon Jan 19, 2015 06:51 pm