హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లి స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎపి వ్యవహారాల ఇన్ఛార్జి ఊమెన్ చాందీ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 31వ తేదీన మరొకసారి సమావేశమై చర్చిస్తామని ఆయన అన్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ వారంలోనే కమిటీలపై ఒక నివేదికను అధిష్టానానికి పంపిస్తామని ఊమెన్చాందీ చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ నెల 31న సమావేశంలో దీనిపై కూడా సమగ్రంగా చర్చిస్తామని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm