ఢిల్లీ: ప్రత్యేకహోదా కోసం పోరాడి మన హక్కులను సాధించుకుందామని.. ప్రాణాలు పొగొట్టుకుని కుటుంబాలను అనాథలుగా చేయవద్దని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందడుగు వేయాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన శ్రీకాకుళం వాసి మృతిచెందడంపై చంద్రబాబు మాట్లాడారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీఎం తెలిపారు. ఆ లేఖకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘటన తన మనసును కలిచివేసిందని చంద్రబాబు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm