హైదరాబాద్: ఈ నెలాఖరు లోపు తమ పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. లోక్సభ స్థానాల్లో పోటీకి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. గాంధీభవన్లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. నెలాఖరు నాటికి పొత్తుల మీద కూడా ఒక స్పష్టత వస్తుందని.. రాష్ట్ర నాయకులతో చర్చించి తమ నిర్ణయాన్ని అధిష్ఠానానికి పంపుతామని ఆయన వివరించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదని..ఎర్రజొన్నలను కొనుగోలు చేశామన్న ప్రభుత్వం మాటలు అవాస్తవమని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నా మాట్లాడే మంత్రి కూడా లేరని ఆయన వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm