సంగారెడ్డి : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ వద్ద సోమవారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి శిరంశెట్టి(26) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. శవ పరీక్ష కోసం శిరంశెట్టి మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిరంశెట్టి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm