హైదరాబాద్: సింగూరు జలాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భార్యతో కలిసి దీక్ష చేయనున్నారు. ఈనెల 18న తాను, తన భార్య నిర్మల దీక్ష చేస్తామని ఆయన తెలిపారు. సింగూరు నీళ్ల కోసం తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సింగూరు జలాలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ జీవో లేకుండా నీళ్లు తరలించడం అక్రమమని మండిపడ్డారు. నీటి తరలింపునకు కారణం హరీష్రావే అని ఆయన ఆరోపించారు. సింగూరును తన జాగీరులా హరీష్ వ్యవహరించారని దుయ్యబట్టారు. సింగూరు డ్యామ్ని నింపుతామన్న మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm