న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో పుల్వామా జిల్లా అవంతిపొరాలో జరిగిన ఉగ్రదాడి పట్ల దేశం యావత్తూ ఆగ్రహావేశాల్లో ఊగిపోయింది. అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కాశ్మీర్లో పెద్ద సంఖ్యలో యువత నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు చెప్పారు ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని వారు డిమాండ్ చేశారు. భోపాల్లో బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm