హైదరాబాద్: నష్టపోయిన రైతల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇంత వరకు పసుపు బోర్డ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువుల విషయంలో వ్యాపారులు సిండికేట్ అయ్యారన్నారు. కేబినెట్ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని కోదండరాం వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm