విజయవాడ: జనసేన పార్టీలో స్క్రీనింగ్ కమిటీ ప్రక్రియ కొనసాగుతుంది. జనసేన అభ్యర్థుల బయోడేటాల పరిశీలన జరుగుతోంది. మాదాసు గంగాధరం ఆధ్వర్యంలో బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. దశమి కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. వందల సంఖ్యలో దరఖాస్తులు, కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయం కిటకిటలాడుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా బయోడేటాల పరిశీలన జరుగుతోంది. ప్రతి ఒక్కరి దరఖాస్తుని స్క్రీనింగ్ కమిటీ సునిశితంగా పరిశీలిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm