హైదరాబాద్: 'బాహుబలి 2'లో సేతుపతిగా నటించిన రాకేశ్ వర్రే హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎవరికీ చెప్పొద్దు'. బసవ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను క్రేజీ ఆంట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై హీరో రాకేశ్ వర్రే నిర్మిస్తున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గార్గేయ ఎల్లాప్రగడ హీరోయిన్గా నటిస్తోంది. శంకర్ శర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. హీరో, హీరోయిన్లు కాఫీ షాప్లో కలుసుకోవడం, వారి మధ్య జరిగిన సంభాషణను చాలా ఆసక్తికరంగా టీజర్లో చూపించారు.
Mon Jan 19, 2015 06:51 pm