ఖమ్మం: జిల్లాకు చెందిన నేలకొండపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జ్యోతి అవినీతి నిరోదక శాఖకు చిక్కింది. పాస్బుక్ విషయంలో రైతు నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నఅధికారులు ఈ రోజు లంచం తీసుకుంటుండగా జ్యోతిని రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm