హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూౌ ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారన్నారు. గెలుపోటములు కాంగ్రెస్ కు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ప్రజాసేవ తప్ప.. రాజకీయ ప్రయోజనం ఆశించదన్నారు. రాహుల్ ని ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని రాహుల్ ని ప్రధానిని చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm