ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా తగిన సమాధానం చెప్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా బలగాలకు సూచించారు. ఉత్తర్ప్రదేశ్లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో డిఫెన్స్ కారిడార్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ.... ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్పందించాలనుకుంటున్నారో పూర్తిగా మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దానికి అన్ని అనుమతులు ఇస్తున్నాం...ఇదే భారత్ కొత్త విధానం అని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు దీటైన జవాబిస్తారని హెచ్చరించారు. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm