అగర్తలా: పుల్వామా దాడిలో మృతిచెందిన సీఆర్పీఎప్ జవాన్లకు.. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి జవాన్ కుటుంబానికి 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు మృతిచెందారు. ముంబైలోని సిద్ధివినాయక ఆలయ ట్రస్టు కూడా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు 51 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm